తల్లులకు గుడ్ న్యూస్.. జులై 16న ‘తల్లికి వందనం’ డబ్బులు విడుదల.. రూ.13 వేలు రావాలంటే.. తప్పకుండా ఇలా చేయండి.. AP Talliki Vandanam Scheme 2026 Amount Release Date
AP Talliki Vandanam Scheme 2026 Amount Release Final Date : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం డబ్బులను 16, 17, 18 జూలై 2026 తేదీలలో ఖాతాలో జమ చేస్తామని విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించారు. ఆ తేదీలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై 15 నుంచి గవర్నమెంట్ విజయాలపై డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని తెలిపారు.

తల్లికి వందనం నిధులు జమ కావాలనుకుంటే ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా తెరవాలని సంక్షేమ శాఖ అధికారి గారు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి నిధులు జూలై 16, 17, 18 తేదీలలో తల్లికి వందనం డబ్బులు విడుదలవుతున్నాయి. అర్హులైన విద్యార్థులు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లలో ఖాతా తెరిచి, NPCI లింక్ చేయించుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం అనాధ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పక్కా అందేలా చర్ల చేయాలని మంత్రుల అధికారులకు జారీ చేశారు. తల్లికి వందనం కింద విద్యార్థికి 13వేల చొప్పున నగదు నగదును తల్లుల ఖాతాలు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తుంది. గత సంవత్సరంలో ఆధార్ కార్డు లింక్ లేకపోవడంతో చాలామందికి స్కీము దూరమయ్యాయి.
అలాంటి ఇబ్బందులు రిపీటెడ్ కాకుండా ముందస్తుగా బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బ్యాంకుకు వెళ్లి ఈ కేవైసీ మరియు NPCI మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా చేపించాలని తెలిపారు. ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందో లేదో తెలుసుకునేందుకు https://bm-sgsw.ap.gov.in/ వెబ్సైట్ కి వెళ్ళాలి. మెయిన్ మెనూ లో ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబరు స్కీం టైప్లో తల్లికి వందనం సెలెక్ట్ చేయాలి, ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేసి లబ్ధిదారుల సమాచారం కనిపిస్తుంది. అందులో అన్ని 7 Satisfied అని ఉండాలి. అప్పుడే మీకు తల్లికి వందనం అకౌంట్లో 13000 చొప్పున జమ చేస్తారు. తల్లికి వందనం పథకాన్ని జూలైలో 16, 17, 18 తేదీలలో అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. గత సంవత్సరంలో జూన్ 12నే విద్యార్థులకు తల్లికి వందన అకౌంట్లో చెప్పిన జమ చేసింది. ఈ సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కుటుంబంలో అర్హులైన పిల్లలందరికీ ఈ తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. ఈ సంవత్సరం దాదాపుగా 68 లక్షల మందికి లబ్ధి చేరుతుంది.
తల్లికి వందనం రూ.13000 రావాలంటే…
•జూలై 16, 17, 18 తేదీలలో తల్లికి వందనం రూ.13000 జమ కానన్నాయి. ప్రతి తల్లులు తప్పనిసరిగా ఈ క్రింది పనులు పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయని అధికారులు తెలిపారు
*తల్లులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చేసి ఉండాలని తెలిపారు.
*బ్యాంకు కి వెళ్లి e-KYC పూర్తి చేయాలని తెలిపారు. అలాగే NPCI మ్యాపింగ్ చేయాలని తెలిపారు.
*విద్యార్థుల అటెండెన్స్ 75% కంటే ఎక్కువగా ఉండాలి.
* ఆధార్ కార్డు వివరాలలో పొరపాట్లు ఉన్నట్లయితే సరి చేసుకోవాలని తెలిపారు.
*మీ గ్రామ వార్డు సచివాలయ డేటా బేస్ లో కుటుంబ వివరాలు తప్పుగా ఉండకూడదు.. వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి.

